సతీసమేతంగా శారదాపీఠానికి వెళ్లిన విజయసాయి
శారదాపీఠాధిపతి స్వరూపానంద ఆశీస్సులు అందుకున్న విజయసాయి దంపతులు
విశాఖ: వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా శారదాపీఠం ఆశ్రమానికి వెళ్లి స్వరూపానంద ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానంద వారికి పట్టువస్త్రాలు బహూకరించి దీవెనలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయసాయి తన ట్విట్టర్ లో అకౌంట్ లో పంచుకున్నారు. కాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద చాతుర్మాస్య దీక్ష ముగించుకుని విశాఖ వచ్చారు. ఆయన రిషికేష్ లో చాతుర్మాస్య దీక్ష ఆచరించారు. దీక్ష ముగించుకుని విశాఖకు వచ్చారు. స్వామి స్వరూపానంద రిషికేష్ లో దీక్ష చేపట్టిన సమయంలోనూ అనేకమంది ప్రముఖులు అక్కడికే వెళ్లి ఆయనను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/