ఆదిపురుష్ టికెట్ ధర పెంపుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఈ నెల 16 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిర్ ఖాన్ , కృతి సనన్ తో పాటు పలువురు స్టార్ నటి నటులు నటించారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని యావత్ అభిమానులు, రామ భక్తులు , సినీ లవర్స్ ఇలా ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్‌పై రూ.50 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే పెంపుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే థియేటర్లలో ఆరో షోకు ఓకే చెప్పింది. ఉదయం నాలుగు గంటల నుండి ఆదిపురుష్ సినిమాను థియేటర్ లలో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.175 ఉండగా.. రూ.50 వరకు పెంచుకోవచ్చు. 3డీ గ్లాస్ ల ఛార్జ్ వసూలు చేయనున్నారు. ఏపీలోను టిక్కెట్ ధరను రూ.50 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఆదిపురుష్ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ అందించడం అభిమానులను , చిత్ర నిర్మాతలను సంతోషానికీ గురి చేస్తుంది.