నైజీరియాలో ఘోర ప్రమాదం… పడవ మునిగి 100 మంది మృతి

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న వారి పడవ నదిలో మునిగి వంద మందికిపైగా చనిపోయారు. ఈ ప్రమాదం నైజిరియాలోని ఎగ్బోటి గ్రామంలో చోటుచేసుకుంది. దాదాపు 100 మందికి పైగా పెళ్లికి వెళ్లి వస్తుండగా..నదిలోని అలల ఉద్ధృతికి పడవ కుదుపులకు లోనై, ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టింది. దీంతో పడవ లో ఉన్న వారంతా నీటిలో పడిపోయారు.

ఇందులో, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని, దీంతో ఇందులో చాలామంది నీటిలో మునిగిపోయారని స్థానికులు చెబుతున్నారు. వేకువజామున జరగడంతో ఈ ప్రమాదం గురించి ఆలస్యంగా బయటకు వచ్చిందని, పడవ ప్రమాదంలో ప్రాణాలతో బ్రతికి ఉన్న వాళ్లను కాపాడటం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా నైజర్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి క్వారా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.