పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాదం

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. లోయర్ కాఫర్ డ్యాం వద్ద పనులు చేస్తుండగాప్రమాదవశాత్తు గోదావరి నదిలో డోజర్ మునిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని , డ్రైవర్ వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.