పులివెందుల లో వైస్సార్సీపీ కి భారీ షాక్..

CM jagan

ఏపీ అధికార పార్టీ వైస్సార్సీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీలోని కీలక నేతలు వరుసపెట్టి పార్టీ కి దూరమవుతున్నారు. పార్టీ కార్యకలాపాలు నచ్చక బయటకు వస్తున్నారు. మరికొంతమంది నేతల పనితీరు నచ్చకపోవడం తో పార్టీ కి గుడ్ బై చెపుతున్నారు. గత రెండు నెలలో భారీ ఎత్తున నేతలు బయటకు రాగా..తాజాగా పులివెందుల లో వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది.

ముందు నుండి వైఎస్ కుటుంబం వెంట ఉండే వేంపల్లికి చెందిన జయచంద్రారెడ్డి వైస్సార్సీపీ కి రాజీనామా చేశారు. కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేనప్పుడు పార్టీలో కొనసాగడం ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ని పలుమార్లు కలిసి స్థానిక సమస్యలపై విన్నవించినా ఫలితం లేదన్నారు. జగన్ సీఎం అయిన నాలుగేళ్ల నుంచి ఇక్కడ పరిస్థితులు తారుమరు అయ్యాయన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు చాలామంది తనలాగే అసంతృప్తిగా ఉన్నారన్నారు. మరికొద్ది రోజుల్లో నాలాంటి వారు చాలామంది బయటకు వస్తారని జయచంద్రారెడ్డి అన్నారు.