దేశంలో కొత్తగా 94,052 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,83,121
మొత్తం మృతుల సంఖ్య 3,59,676
న్యూఢిల్లీ: దేశంలో రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో నిన్న 94,052 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం… నిన్న 1,51,367 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. మరో 6,148 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,59,676కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,76,55,493 మంది కోలుకున్నారు. 11,67,952 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,21,98,253 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,04,690 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/