పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్న ఇండియా కూటమి

india-alliance-decision-to-boycott-parliament-session

న్యూఢిల్లీః పార్లమెంట్ సమావేశాల ఇండియా కూటమి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి పక్షాల కూటమి నిర్ణయం తీసుకుంది. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది ఇండియా కూటమి పక్షాల కూటమి. మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో భేటీ అయిన ఇండియా కూటమి పక్షాల ఫ్లోర్ లీడర్లు…ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ కాబోతుంది. గతంలో 3 సార్లు (పాట్నా, బెంగళూరు, ముంబై) సమావేశమైన ఇండియా కూటమి.. ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. ఇండియా కూటమి కీలక భేటీ అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారమ్ ,ప్రణాళిక ప్రధానాంశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ పై చర్చ కూడా జరుగనుంది.