దేశంలో కొత్తగా 8,813 కరోనా కేసులు

క్రియాశీల కేసులు.. 1,11,252

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 15,040 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో మొత్తం 4,42,77,194కు చేరింది. ఇందులో 4,36,38,844 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా మొత్తం 5,27,098 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 4.15శాతం ఉన్నది. దేశంలో ఇప్పటి వరకు 208.31కోట్ల టీకా డోసులను పంపిణీ పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/