భారత్‌లో కొత్తగా 83,883 పాజిటివ్‌ కేసులు

మొత్తం కేసులు 38,53,407..మొత్తం మృతుల సంఖ్య 67,376

Covid-19-Effect-
Covid-19

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 83,883 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధికే కేసులు ఇవే. అదే సమయంలో 1,043 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 38,53,407కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 67,376 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 29,70,493 మంది కోలుకున్నారు. 8,15,538 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో రికవరీల రేటు 77 శాతంగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/