భారత్‌లో కొత్తగా 77,266 పాజిటివ్‌ కేసులు

మొత్తం కేసులు 33,87,501..మొత్తం మృతులు 61,529

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 77,266 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,057 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,87,501 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 61,529కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,83,948 మంది కోలుకున్నారు. 7,42,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,94,77,848 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,01,338 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/