దేశంలో కొత్తగా 60,753 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793
మొత్తం మృతుల సంఖ్య 3,85,137
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకు దిగి వస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 60,753 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం… నిన్న 97,743 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మరో 1,647 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137 కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. 7,60,019 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 27,23,88,783 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,92,07,637 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,02,009 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/