దేశంలో కొత్తగా 5,747 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,848

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,618 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,53,374 మంది కరోనా నుంచి కోలుకోగా… 5,28,302 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,41,70,550 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 23,92,530 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/