దేశంలో కొత్తగా 48,698 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143
మొత్తం మృతుల సంఖ్య 3,94,493
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 48,698 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం.. 24 గంటల్లో 64,818 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,183 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,94,493కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,93,085 మంది కోలుకున్నారు. 5,95,565 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/