నేడు పల్లె ప్రగ‌తి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: సీఎం కెసిఆర్ శని‌వారం ఉదయం 11 గంట‌లకు ప్రగ‌తి‌భ‌వ‌న్‌లో జిల్లా కలె‌క్టర్లలతో కాన్ఫరెన్స్‌ను నిర్వహించ‌ను‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించా‌లని నిశ్చయించిన సీఎం కేసీఆర్‌.. గ్రామాలు, పట్టణాల వారీగా చేప‌ట్టా‌ల్సిన కార్యక్రమా‌లపై అధి‌కా‌రు‌లకు దిశా‌ని‌ర్దేశం చేయనున్నారు. పల్లె, పట్టణ ప్రగ‌తిలో చే‌ప‌ట్టా‌ల్సిన కార్యక్రమాలు, హరి‌త‌హా‌రం విజ‌య‌వంతానికి తీసు‌కో‌వా‌ల్సిన చర్యలపై సమ‌గ్రంగా ఈ సమా‌వే‌శంలో చర్చి‌స్తారు. ప్రకృతి వనాలను అభివృద్ధి చేసే విషయమై లక్ష్యాన్ని నిర్ధేశించనున్నారు. కాగా, ఈ దఫా హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సీఎం కేసీ‌ఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ప్రణా‌ళిక సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల కార్యద‌ర్శులు, హెచ్‌‌వో‌డీలు, లోకల్‌ బాడీ అడి‌ష‌నల్‌ కలె‌క్టర్లు, డీపీ‌వోలు, డీఆ‌ర్డీ‌వోలు హాజ‌ర‌వు‌తారు. అటవీశాఖ జిల్లాస్థాయి అధికారులు, సంరక్షకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/