ఒకే వేదికపై మోడీ, శరద్ పవార్..లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని
పవార్ ను ఆప్యాయంగా పలకరించిన మోడీ
పుణెః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం నాడు ఒకే వేదకను పంచుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోడీ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శరద్ పవార్ ను మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇవి తనకు గుర్తుండిపోయే క్షణాలని చెప్పారు.
ఇండియా కూటమి మూడో సమావేశం త్వరలో ముంబయిలో జరగబోతున్న తరుణంలో ప్రధానితో వేదికను పంచుకోవడం సరికాదని కొందరు నేతలు చెప్పినప్పటికీ శరద్ పవార్ పట్టించుకోలేదు. లోక్ సభలో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బిజెపి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన శరద్ పవార్, మోడీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం వారికి మింగుడు పడటం లేదు.