దేశంలో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు

రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతం

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనాతో 66 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. అలాగే క‌రోనా నుంచి నిన్న 9,620 మంది కోలుకున్నార‌ని చెప్పింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,98,095గా ఉంద‌ని పేర్కొంది.

ఇక ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య‌ 54,118గా ఉంద‌ని వివ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 178.90 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించిన‌ట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉంద‌ని చెప్పింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/