దేశంలో కొత్తగా 43,263 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,31,39,981
మొత్తం మృతుల సంఖ్య 4,41,749

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 43,263 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,39,981కి చేరింది. అలాగే, నిన్న 40,567 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 338 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,749కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,04,618 మంది కోలుకున్నారు. 3,93,614 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 86,51,701 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 71,65,97,428 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 30,196 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 181 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/