తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354..మొత్తం మృతుల సంఖ్య 1,541

corona cases in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 316 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,78,839 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,541కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,974 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,823 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్త లకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/