జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/06/4-terrorists-killed-in-JKs-Kupwara-as-security-forces-foil-infiltration-bid-jpg.webp)
కుప్వారాః జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచల్ సెక్టార్ లో గల నియంత్రణరేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
కాగా, జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.