నరసరావుపేటలో ఈ నెల 29,30 పూర్తి లాక్డౌన్
గుంటూరు కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్
గుంటూరు: నరసారావుపేటలో భారీగా కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదిల్లో పూర్తి లాక్డౌన్ ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ రోజు నరసారావు పేటలో కలెక్టర్ పర్యటించారు. కరోనా కేసుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు సామాజిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలని సూచించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/