దేశంలో కొత్తగా 2430 కరోనా కేసులు

corona virus
corona virus

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు కొత్తగా 2,430 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,26,427కు చేరాయి. ఇందులో 4,40,70,935 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,874 మంది మృతిచెందారు. మరో 26,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 8 మంది మృతిచెందగా 2378 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.75 శాతం ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.06 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మరణాల రేటు 1.2 శాతంగా ఉందని తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/