తెలంగాణలో కొత్తగా 226 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,621..మొత్తం మృతుల సంఖ్య 1,584

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 226 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 224 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,87,117 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,584 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,920 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,322 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 39 కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/