టీఆర్ఎస్ ముందంజ
అయినా మ్యాజిక్ ఫిగర్ కు దూరం!
Hyderabad: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఒక స్పష్టత వచ్చింది. ఈ సారి ఎన్నికలలో బీజేపీ బాగా పుంజుకుంది. ఎంఐఎం తన పట్టు నిలబెట్టుకుంది.
టీఆర్ఎస్ ఫలితాలలో ముందంజలో ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి 47 స్థానాలలో విజయం సాధించి మరో 14 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
ఐంఐఎం 41 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 46 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/