గాడ్సే దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరిస్తున్నారు
గాడ్సే ఓ దేశభక్తుడంటూ బిజెపి ఎంపీలు సంబరాలు జరుపుకుంటున్నారు
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి రోజున ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ఓ దేశభక్తుడంటూ బిజెపి ఎంపీలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. గాడ్సేను బహిరంగంగా నిందించేందుకు వారు నిరాకరిస్తున్నారని, పైగా, అతడి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటూ సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఓ ఉగ్రవాదిని క్షమిస్తున్నారని, అతడి దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/