దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు

corona virus
corona virus

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2,112 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,043 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 528,957 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.53 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.