పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా పట్టుబడ్డ నగదు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతున్నాయి. ఈ నెల 18న మునుగోడు నియోజయకవర్గంలోని గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షల నగదు పట్టుబడింది. అంతకుముందురోజు మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్‌కు ఏకంగా కోటి రూపాయల నగదు చిక్కింది. ఇదే చెక్‌పోస్టు వద్ద ఈనెల 13న ఓ కారులో రూ.13 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇలా పోలీసుల సోదాల్లో అనేక చోట్ల భారీ ఎత్తున నగదు పట్టుబడగా..నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు చేసారు.

ఇదిలా ఉండగానే ఈరోజు శనివారం ఉదయం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఓ కారులో రూ.20 లక్షలు లభించాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వస్తున్న కారులో పోలీసులు తనిఖీలు చేయగా..ఓ కార్ లో రూ. 20 లక్షల డబ్బును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి పత్రాలను చూపించకపోవడంతో డబ్బును, కారును పోలీసులు సీజ్‌ చేశారు. డబ్బును తరలిస్తున్న అభిషేక్‌ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.