దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 1,43,384
న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 20,408 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 20,958 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,36,173 మంది వైరస్ బారినపడగా.. మరో 1,917 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,07,00,946కు చేరింది. ఇప్పటివరకు వైరస్తో 64,17,323 మంది మరణించారు. ఒక్కరోజే 8,62,421 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,06,76,713కు చేరింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/