దేశంలో కొత్తగా 18,930 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు..1,19,457

corona virus-india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 18,930 మంది వైరస్​ బారినపడగా.. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య బుధవారంతో పోలిస్తే 2,500కు పైగా కేసులు పెరిగాయి. కొవిడ్​ నుంచి 14,650 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి పెరిగింది.

దేశంలో బుధవారం 11,44,489 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,33,18,772కు చేరింది. మరో 4,38,005 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా ఒమిక్రాన్​ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75 భారత్​లో వెలుగుచూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలుత భారత్​లో కనిపించిన ఈ వేరియంట్.. ఇప్పటివరకు 10 దేశాల్లో బయటపడ్డట్లు తెలిపింది. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,52,758 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,585 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,75,61,264కు చేరింది. మరణాల సంఖ్య 63,66,875కు చేరింది. ఒక్కరోజే 5,27,087మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,13,80,711కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/