భార‌త్‌లో కొత్త‌గా17,407 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923.. మొత్తం మృతుల సంఖ్య 1,57,435

న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పోకడ కనిపిస్తోంది. కొత్త‌గా మొన్న క‌రోనా కేసులు 12,286 గా న‌మోదు కాగా, నిన్న 14,989 కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా నిర్ధారణ అయింది.

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో అదే స‌మ‌యంలో 14,031 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,26,075 మంది కోలుకున్నారు. 1,73,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,66,16,048 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,91,78,908 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,75,631 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/