దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 1,37,057
న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 17,135 మందికి వైరస్ నిర్ధరణ కాగా..మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 19,823 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. భారత్లో మంగళవారం 23,49,651 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. మరో 4,64,919 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,21,908 మంది వైరస్ బారినపడగా.. మరో 1,938 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 583,944,874 కు చేరింది. ఇప్పటివరకు వైరస్తో 64,18,751 మంది మరణించారు. ఒక్కరోజే 1,087,782 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 554,463,913కు చేరింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/