వంతెన పై నుంచి నది పడిన బస్సు.. 15 మంది మృతి
ఖర్గోన్: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్ వద్ద 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది వరకు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో 50 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.