దేశంలో కొత్త‌గా 11,903 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,59,191

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 11,903 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,51,209 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న క‌రోనా నుంచి 14,159 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,97,740కు చేరింది.

రిక‌వ‌రీ రేటు 98.22 శాతంగా ఉంది. నిన్న క‌రోనా వ‌ల్ల 311 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,191కు చేరింది. నిన్న దేశంలో 41,16,230 డోసుల‌ వ్యాక్సిన్ వేశారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 61.12 కోట్ల క‌రోనా టెస్టులు చేశారు. 107.29 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్ వేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/