టీడీపీపై నాకు అభిమానం లేదు – కొడాలి నాని

టీడీపీపై తనకు అభిమానం లేదని తేల్చి చెప్పారు వైస్సార్సీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది హరికృష్ణ అని , తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జూ. ఎన్టీఆర్ అని వీరిద్దరికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు నాని. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారని , ఆ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని నాని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలే వీరికి సరైన గుణపాఠం చెపుతారని అన్నారు.

ప్రశాంతంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరుతో పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని… అలాంటి ఎన్టీఆర్ ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబును నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పు అని అన్నారు. చంద్రబాబు విశ్వాసం లేని వ్యక్తి అని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబంపై తనకు విశ్వాసం ఉందని అన్నారు. అలాగే జీవితంలో తోడు కోసమే లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని, ఆమెకు ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదని నాని అన్నారు.