దేశంలో కొత్తగా 11,109 కరోనా కేసలు

11,109 new corona cases in india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11 వేలకు పైనే కరోనా కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11,109 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితోపోలిస్తే 9 శాతం ఎక్కువ. నిన్న ఒక్కరోజే 10,158 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. ప్రస్తుతం 49,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,16,583 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,064 కి చేరింది.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల ( 220,66,25,120) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.