‘రంగ రంగ వైభవంగా’ సెన్సార్ పూర్తి
వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఉప్పెన తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లోకి మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపోలం మూవీ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మూడో చిత్రం రంగరంగ వైభవంగా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గిరీశయ్య రంగరంగ మూవీకి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను దక్కించుకుంది. 2 గంటల 23 నిమిషాలుగా రన్ టైమ్ను లాక్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే..ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అర్ధమవుతుంది. ఒకరినొకరు ప్రేమించుకునే ఓ అమ్మాయి.. అబ్బాయి.. మనసులోని ఇగోల కారణంగా వారి ప్రేమను చెప్పుకోరు. వారి ప్రేమ ప్రయాణం ఎలాంటి మజిలీని చేరుకుందనేదే కథాంశం అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు చేసిన రెండు చిత్రాలకు భిన్నంగా వైష్ణవ్ తేజ్ చేసిన ఈ చిత్రం తేజ్ కు ఏ మేరకు సక్సెస్ ఇస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.