దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,725 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. తాజాగా 13,084 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. ఇందులో 4,37,57,385 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,27,488 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 94,047 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 210.82కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/