భారత్‌లో గత 24గంటల్లో10 వేలకు పైగా కొత్త కేసులు

మొత్తం కేసులు 3,43,091

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విలాయతాండవం చేస్తుంది. గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10,215 మంది రికవరీ కాగా, 380 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా, 1,80,013 మంది రికవరీ అయ్యారని, 9,900 మంది మరణించారని అధికారులు గణాంకాలు విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నట్లయింది. ఈమేరకు కేంద్ర వైద్యశాఖ అధికారులు వివరాలను వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/