‘తూర్పు’లో 10 టీడీపీ స్థానాలు ఖరారు..?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి పార్టీలు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఆరు లిస్ట్ లను విడుదల చేసి దాదాపు సగం మందిని ఖరారు చేయగా..ఇక పొత్తులో ఉన్న టిడిపి – జనసేన సైతం తమ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. ఇప్పటీకే ఇరు పార్టీల అధినేత పలు నియోజకవర్గాలకు సంబదించిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాలకుగానూ పదింటికి TDP అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖరారైన వారిలో దివ్య-తుని, వరుపుల సత్యప్రభ-ప్రత్తిపాడు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి-అనపర్తి, జోగేశ్వరరావు-మండపేట, గోరంట్ల బుచ్చయ్య-రాజమండ్రి రూరల్, జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట, చినరాజప్ప-పెద్దాపురం, దాట్ల సుబ్బరాజు-ముమ్మిడివరం, బండారు సత్యానందం-కొత్తపేట, ఆదిరెడ్డి వాసు/ భవాని-రాజమండ్రి అర్బన్ ఉన్నట్లు వినికిడి. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.