ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం..12 మంది మృతి

ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో 12 మంది చనిపోయారు. జిల్లాలోని దిగపహండి వద్ద ఒడిశా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు రెండు ఒకదానికోటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో జరిగింది. రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు ..ఘటన స్థలానికి చేరుకొని క్షత్రగాత్రులను సమీప హాస్పటల్ కు తరలించారు.

ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు చనిపోయారు. బ్రహ్మపుర ప్రాంతంలోని ఖండదేయులి గ్రామం నుంచి ప్రైవేట్ బస్సులో ఒక వివాహ బృందం ప్రయాణిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం. ఒక బస్సు డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు. మరో బస్సు డ్రైవర్​ ఆచూకీ లేదు” అని అధికారులు తెలిపారు.