రైతుల రుణమాఫీ పై కేసీఆర్ కీలక నిర్ణయం

కొత్త ఏడాది సందర్బంగా రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిన్న కమతాలు, బ్యాంకు రుణాలు మరియు రైతు బీమా ఇతర అవసరాల కోసం కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున పంపకాలు చేసుకున్న భూములను దృష్టిలో పెట్టుకొని..75 వేల నుంచి లక్ష వరకు బకాయిలు ఉన్న రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన అతి త్వరలో తెలుపనున్నట్లు చెపుతున్నారు.

ఒక కుటుంబంలో ఎంతమంది పేరిట వ్యవసాయ భూమి ఉన్నా, ఆ భూమిపై ఎన్ని బ్యాంకుల్లో రుణ లు బాకీ పడి ఉన్నా, యాజమాని ఒక్కరికి రుణ విముక్తి పథకం వర్తించేలా కఠినమైన నిబంధనలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.