‘నిర్మల్ హృదయ్’ భవన్ కు వెళ్లిన జగన్ దంపతులు

అనాథ పిల్లలతో ముచ్చటించిన జగన్, భారతి

cm-jagan-and-ys-bharathi-went-to-nirmal-hriday

విజయవాడ: ఏపీ సిఎం జగన్ విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవనానికి వెళ్లారు. నిర్మల్ హృదయ్ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో జగన్ దంపతులు ముచ్చటించారు. మరోవైపు నేటితో సీఎంగా జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర కీలక నేతలు జెండా ఎగురవేశారు. సజ్జల కేక్ కట్ చేశారు.