200 రోజులకు చేరిన యువగళం..లోకేష్ కు చంద్రబాబు విషెష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 200 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా చంద్రబాబు..తన కుమారుడు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర అధికార ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ.. ప్రజల ఆశీర్వాదాలతో విజయవంతంగా సాగుతుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.

యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ టీడీపీ అధినేత అభినందించారు. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మొత్తం 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర చేశారు. రోజుకు సగటున 13.5కి.మీ మేర పాదయాత్ర సాగుతోంది. యువగళం ద్వారా 64 బహిరంగసభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.