జులై 8, 9 తేదీల్లో వైస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు

YSRCP MLC candidates win
YSRCP

అమరావతి: వచ్చే నెల 8, 9 తేదీల్లో సీఎం జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు మంగళగిరిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబును ఓడించండి.. ప్రజలకు సేవ చేసేందుకు వైసీపీకి మరోసారి అవకాశమివ్వండి అనే నినాదంతో ప్లీనరి సమావేశం నిర్వహించుకోనున్నామని తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175కు స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల క్రితం మంగళగిరిలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నామని తెలిపారు. 2027లో మరోసారి ప్లీనరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/