నా భార్యకు ఏమని సమాధానం చెప్పాలిః ఎమ్మెల్యే సుధాకర్బాబు
లోకేశ్ ఆరోపణలతో తమ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన
అమరావతిః రాజకీయాల్లో తాను అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు సంపాదించానని లోకేశ్ చేసిన ఆరోపణలను టీవీలో చూసిన తన భార్య.. ఆ డబ్బంతా ఏం చేశావని ప్రశ్నిస్తోందని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు పేర్కొన్నారు. ఇప్పుడు ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్ ఆరోపణలతో తమ ఇంట్లో సమస్యలు వస్తున్నాయన్నారు. లోకేశ్ తాను చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తగదని లోకేశ్కు హితవు పలికారు. శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని అన్నారు. టిడిపి హయాంలో కంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే గ్రానైట్ పరిశ్రమకు మేలు జరిగిందని అన్నారు.