పాలనలో జగన్ కు ఇంకా అనుభవం రాలేదు – వైస్సార్సీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

పాలనలో జగన్ కు ఇంకా అనుభవం రాలేదంటూ ఆదోనీ వైస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత కొద్దీ నెలలుగా సొంత పార్టీ నేతలే అధిష్టానం ఫై అసంతృప్తి తో ఉన్నారనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థిని కాదని , టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి వారి గెలుపుకు నలుగురు ఎమ్మెల్యేలు కారణమయ్యారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యే లను పార్టీ సస్పెండ్ చేసింది.

ఇదిలా ఉండగానే తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీ వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నాయకులతో ఎలా వుండాలన్న దానిపై జగన్ అనుభవం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రెండోసారి సీఎంగా అవకాశమిస్తే జగన్‌కు పూర్తి అవగాహన వస్తుందని సాయిప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతతం ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.