ఏపీలో నేటి నుండి మూడు రోజుల పాటు BRS ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు

తెలంగాణ సీఎం , BRS అధినేత కేసీఆర్..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర లో భారీ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున నేతలను బిఆర్ఎస్ లో ఆహ్వానించగా, ఏపీ ఫై కూడా పూర్తి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేటి నుండి మూడు రోజుల పాటు ఏపీలో BRS ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉత్తరాంధ్ర లో పర్యటించబోతున్నారు.

ఈరోజు మధ్యాహ్నం – విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సిరిపురం వుడా పార్క్ వరకు BRS ర్యాలీ, ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. సోమవారం ఆర్కే బీచ్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ర్యాలీ, కార్మిక నాయకులతో భేటీ కానున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై సమావేశం కానున్నారు.