టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్ చిత్రసీమ లో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది లో ఇప్పటికే పలువురు నటి నటులు, దర్శక , నిర్మాతలు పలు కారణాల కారణంగా మరణించగా..తాజాగా ఈరోజు మరో నిర్మాత తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ కొమ్మరం వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు.

జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన వెంకటేష్.. ఫిలిం ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్‌గా గెలుపొంది సేవలందించారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన షేర్ అనే చిత్రాన్ని కూడా ఈయనే నిర్మంచారు. చిత్రపురి కాలనీకి అధ్యక్షుడిగానూ వెంకటేశ్ పనిచేశారు. వెంకటేశ్ మృతిపట్ల పలువురు సీనీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.