తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎంట్రీ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణ లోకి ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీ కి జాతీయ పతాకాన్ని అందించనున్నారు టి కాంగ్రెస్ నేతలు. కృష్ణా నది‌బ్రిడ్జి‌నుండి తెలంగాణ లో మూడు కిలోమీటర్ల మేర సాగనుంది. ఈరోజు మరిక్కల్ వద్ద ప్రసంగించాక ఢిల్లీ కి రాహుల్ గాంధీ వెళ్లనున్నారు.

మక్తల్ నుండి హైదరాబాద్ కి హెలికాప్టర్ లో ప్రయాణం చేసి.. అక్కడ నుండి‌ ఢిల్లీకి రాహుల్ పయనం కానున్నారు. దీపావళి పండుగ కోసం మూడు రోజులు జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చారు రాహుల్‌. ఈ నెల 27 ఉదయం 6 గంటల నుండి మళ్లీ మక్తల్ నుండి జోడో యాత్ర ఆరంభం కానుంది. నవంబర్ 8 వరకు తెలంగాణలో జోడో యాత్ర కొనసాగనుంది. ఇక రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా రాహుల్‌ను స్వాగతించనున్నారు.