నేడు ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ

నేడు ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్లు విడుదల చేయనుంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయనుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా… సొంత గ్రామాలకు వచ్చి.. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ తీసుకోవాలని ఏపీ సర్కార్‌ కోరింది.

మరోపక్క ఈరోజు సీఎం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది– మొదటి విడతగా వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.