యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మార్పుపై సజ్జల కామెంట్స్

ఏపీలో ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలలో వలసలు మొదలయ్యాయి.తమకు ఏ పార్టీ లో అనుకూలమో..ప్రజలు ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారో దానిని బట్టి నేతలు తమ రాజకీయ భవిష్యత్ చూసుకుంటున్నారు.ఇప్పటికే పలువురు టీడీపీ , జనసేన , వైసీపీ పార్టీలలో చేరగా..తాజాగా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారబోతున్నారనే వార్తలు కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు సైతం వరుసగా కీలక నేతలతో , కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్నారు.

ఈ వార్తలపై సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎటు వెళ్లాలన్నది అతని ఇష్టం. ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన చోట మరొకరికి సర్దుబాటు చేస్తాం.. కాదనుకుంటే వారి ఇష్టమంటూ వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి నిర్ణయాలు వారివి అన్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారాన్ని వైసీపీ పార్టీ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యార్లగడ్డ వెంకట్రావు కు టిడిపి నుంచి ఆఫర్ ఉన్నట్లు సమాచారం.